దసరా వేడుకల్లో అపశృతి... రూ.50లక్షల ఆస్తి నష్టం

Published : Oct 09, 2019, 10:42 AM IST
దసరా వేడుకల్లో అపశృతి... రూ.50లక్షల ఆస్తి నష్టం

సారాంశం

కడపలోని బీకేఎం వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఏసీ లు మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. 


దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకొని దాదాపు రూ.50లక్షల ఆస్తి నష్టం నెలకొంది. ఈ సంఘటన కడపలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... దసరా వేడుకల్లో భాగంగా  మంగళవారం కడపలో దుర్గా మాతను ఊరేగించారు. ఈ ఊరేగింపులో భాగంగా భక్తులు బాణసంచా కాల్చారు.

ఆ సమయంలో నిప్పు రవ్వలు ఎగసిపడి.. ఓ గోదాంలోని అట్టపెట్టలపై పడ్డాయి. ఈ విషయాన్ని వెంటనే ఎవరూ గుర్తించకపోవడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. గోదాం పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటనలో దాదాపు రూ.50లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. కడపలోని బీకేఎం వీధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోదాంలోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, ఏసీ లు మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే