పశ్చిమ గోదావరి : ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ ఆరుగురు

By Siva KodatiFirst Published Dec 21, 2022, 5:12 PM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది . ప్రమాదం నుంచి ఆరుగురు సిబ్బంది బయటపడగా.. ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. 

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. సాల్వెంట్ ఆయిల్ ప్లాంట్‌లో మంటలు ఎగసిపడుతున్నాయి. భారీగా పొగ కమ్ముకుంది. ప్రమాదం నుంచి ఆరుగురు సిబ్బంది బయటపడగా.. ఒకరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!