ఎనిమిదేళ్ల కూతురిపై మారు తండ్రి అత్యాచారం

Published : Jun 12, 2018, 01:48 PM IST
ఎనిమిదేళ్ల కూతురిపై మారు తండ్రి అత్యాచారం

సారాంశం

గుంటూరు జిల్లాలో దారుణం

రక్షణగా ఉండాల్సిన తండ్రే చిన్నారిని కాటేశాడు. అభం శుభం తెలియని వయసులో వున్న చిన్నారిపై ఓ సవతి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఈ కసాయి తండ్రి మానవ సంభందాలకు తీరని మచ్చ తెచ్చాడు. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

గుంటూరు పట్టణంలోని కాకుమాను ఎస్టీ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది.  ఈ కాలనీకి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో లక్ష్మయ్య అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లి సమయంలో తనతో పాటు తన ఎనిమిదేళ్ల కూతురి  సంరక్షణ కూడా చూసుకుంటానని లక్ష్మయ్య ఆమెను నమ్మబలికాడు. దీంతో అతడి మాటలు నమ్మి మగదిక్కుగా ఉండి అండగా నిలుస్తాడని ఆమె పెళ్లి చేసుకుంది.

అయితే పెళ్లి తర్వాత లక్ష్మయ్య లోని కామాంధుడు బైటికి వచ్చాడు. పాపం...అభం శుభం తెలియని చిన్నారిపై కన్నేశాడు. తాను కూతురు వరస అవుతుందని మరిచి ఇంట్లో భార్యలేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే చిన్నారి అతడి పైశాచికానికి తట్టుకోలేక ఏడుస్తూ కేకలు వేయడం ప్రారంభించింది. ఈ ఏడుపు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని చూడగా లక్ష్మయ్య అఘాయిత్యం చేస్తూ కనిపించాడు. 

దీంతో నిందితుడు లక్ష్మయ్యను స్థానిక  మహిళలు, పురుషులు అంతా కలిసి దేహశుద్ది చేశారు. అనంతరం దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

AP Investments: ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌తకు పండ‌గ‌లాంటి వార్త‌.. తైవాన్ కంపెనీలు భారీగా పెట్టుబ‌డులు
3వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి స్పీచ్ | Nara Bhuvaneswari Visits Horticulture Hub in Kuppam