భార్యపై కోపాన్నిఅభం శుభం తెలియని మూడేళ్ల పసికందుపై చూపించాడో తండ్రి. భార్య కాపురానికి రాకపోవడంతో కత్తిపీటతో పసికందు గొంతుకోసి అత్యంత దారుణంగా హత్యచేశాడు.
విజయనగరం: భార్యపై కోపాన్నిఅభం శుభం తెలియని మూడేళ్ల పసికందుపై చూపించాడో తండ్రి. భార్య కాపురానికి రాకపోవడంతో కత్తిపీటతో పసికందు గొంతుకోసి అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా గరికివలస గ్రామంలో చోటుచేసుకుంది. గుర్ల మండలం గారికివలసకు చెందిన శ్రీనుకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది.
భార్య కాపురానికి రాకపోవడంతో ఆగ్రహం చెందిన శ్రీను తెల్లవారుజామున తన కూతురు సుమలత(3)ను కత్తిపీటతో గొంతుకోసి హత్య చేశాడు. భార్యపై కోపాన్ని ముక్కుపచ్చలారని పసికందుపై చూపించిన ఆ కసాయి తండ్రిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.