తెనాలిలో విషాదం: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు కన్నుమూత

Siva Kodati |  
Published : Jul 21, 2020, 03:23 PM IST
తెనాలిలో విషాదం: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు కన్నుమూత

సారాంశం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తెనాలి మాజీ ఎమ్మెల్యే డార్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి కన్నుమూశారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తెనాలి మాజీ ఎమ్మెల్యే డార్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

రావి మరణవార్త విన్న బంధువులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. రవీంద్రనాథ్ చౌదరి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తెనాలిలోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

నువ్వు నీతులు చెప్పకు అక్క : Byreddy Siddarth Reddy Counter To Byreddy Shabari | Asianet Telugu
TG భ‌ర‌త్ వ్యాఖ్య‌ల‌పై బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి కౌంట‌ర్ Baireddy Siddharth Reddy | Asianet Telugu