ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దు అని ఆందోళన చేసినందుకు మహిళలు అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చి కొట్టిస్తారా? అంటూ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమల్ని మహిళలు నిషేధించడం ఖాయం మంటూ నారా లోకేష్ తిట్టిపోశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాబోయే రోజుల్లో జగన్ ను మహిళలే నిషేధిస్తారని శాపనార్థాలు పెట్టారు లోకేష్.
పాదయాత్రలో సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట తప్పుతున్నారని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల మధ్యలోనే సారా దుకాణాలు తెరుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
ఇంట్లో కాలేజ్ కి వెళ్లే అమ్మాయిలు ఉన్నారు, పిల్లలున్నారు, ఇక్కడ మద్యం దుకాణాలు వద్దు మహాప్రభో అని మహిళలు వేడుకుంటున్నా కనికరించరా అంటూ నిలదీశారు. ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దు అని ఆందోళన చేసినందుకు మహిళలు అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చి కొట్టిస్తారా? అంటూ ప్రశ్నించారు. మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమల్ని మహిళలు నిషేధించడం ఖాయం మంటూ నారా లోకేష్ తిట్టిపోశారు.
పాదయాత్రలో సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్ల మధ్యలోనే జగనన్న సారా దుకాణాలు తెరుస్తున్నారు. ఇంట్లో కాలేజ్ కి వెళ్లే అమ్మాయిలు ఉన్నారు, పిల్లలున్నారు, ఇక్కడ మద్యం దుకాణాలు వద్దు మహాప్రభో అని మహిళలు వేడుకుంటున్నా గారు కనికరించడం లేదు. pic.twitter.com/HgEZTvokfO
— Lokesh Nara (@naralokesh)