మాజీ మంత్రి గంటా అనుచరుడు మృతి

Published : Jul 25, 2020, 10:50 AM IST
మాజీ మంత్రి గంటా అనుచరుడు మృతి

సారాంశం

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ నలంద కిశోర్ ను మూడు వారాల క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అర్థరాత్రి అదుపులో తీసుకున్నారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ విచారించి వదిలేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్(65) మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. కాగా... సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ నలంద కిశోర్ ను మూడు వారాల క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అర్థరాత్రి అదుపులో తీసుకున్నారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ విచారించి వదిలేశారు.

కాగా.. ఈ ఘటన చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కిశోర్ మృతి పట్ల గంటా శ్రీనివాసరావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu