శ్రీహరికోటలో విషాదం: గుండెపోటుతో డీడీ రిపోర్టర్ మృతి

By sivanagaprasad kodatiFirst Published Nov 29, 2018, 9:45 AM IST
Highlights

శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జరగనున్న పీఎస్ఎల్‌వీ-సి43 ప్రయోగాన్ని కవర్ చేయడానికి వచ్చిన దూరదర్శన్ రిపోర్టర్ రాజేంద్రన్ గుండెపోటుతో కన్నుమూయడంతో తోటి మీడియా సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు

శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జరగనున్న పీఎస్ఎల్‌వీ-సి43 ప్రయోగాన్ని కవర్ చేయడానికి వచ్చిన దూరదర్శన్ రిపోర్టర్ రాజేంద్రన్ గుండెపోటుతో కన్నుమూయడంతో తోటి మీడియా సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు.

ఉదయం 9.58కి పీఎస్ఎల్‌వీ-సీ43 నింగిలోకి దూసుకెళ్లనుంది. మనదేశానికి చెందిన హైపవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఒక మైక్రో, 29 నానో ఉపగ్రహాలున్నాయి. ఈ ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో పీఎస్ఎల్‌వీ ప్రవేశపెట్టనుంది. 
 

click me!