లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోస్.. 41ఏ నోటీసులు ఇవ్వమని ఆదేశించిన హైకోర్టు...

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోస్ చేసింది. 

Google News Follow Us

అమరావతి : లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోస్ చేసింది. ఐఆర్ఆర్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోస్ చేస్తున్నట్లు హోకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాదు, లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని కోర్టు చెప్పింది. దీంతో 41ఏ నోటీస్ ఇస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. సిఐడి విచారణకు సహకరించాలని లోకేష్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో లోకేష్ కు సిఐడి బృందం నోటీసులు ఇవ్వనుంది. ఈ కేసులో లోకేష్ ఏ14గా ఉన్నారు. ఇప్పుటికే సిఐడీ బృందం ఢిల్లీ వెళ్లింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

Read more Articles on
click me!