పార్టీ మారనున్న టీడీపీ ఎమ్మెల్యే మేడా..?

Published : Jul 31, 2018, 10:57 AM IST
పార్టీ మారనున్న టీడీపీ ఎమ్మెల్యే మేడా..?

సారాంశం

ఈయన వైసీపీలో చేరనున్నారని జిల్లాలో ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం విస్తృతంగా జరుగడంతో... ముఖ్యమంత్రి దాకా విషయం వెళ్లింది. దీంతో.. ఈ ఎమ్మెల్యేను సీఎం కలావాలని కూడా ఆదేశించారు. 

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఏ పార్టీలో ఉంటే తమకు లాభంగా ఉంటుందో చెక్ చేసుకొని మరి పార్టీ మారుతున్నారు. తాజాగా.. మరో టీడీపీ ఎమ్మెల్యే పార్టీ మారనున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఆయనే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి. ఈయన వైసీపీలో చేరనున్నారని జిల్లాలో ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం విస్తృతంగా జరుగడంతో... ముఖ్యమంత్రి దాకా విషయం వెళ్లింది. దీంతో.. ఈ ఎమ్మెల్యేను సీఎం కలావాలని కూడా ఆదేశించారు. అయితే.. కొన్నికారణాల వల్ల ఆయనకు చంద్రబాబుని కలవడం కుదరలేదు. దీంతో.. పార్టీ మారడం ఖాయం అని అందరూ భావించారు.

తాజాగా.. ఎమ్మెల్యే మేడా.. ముఖ్యమంత్రిని కలిశారు. 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇదే విషయం ముఖ్యమంత్రికి కూడా తెలియజేసినట్లు మేడా వివరించారు. 

PREV
click me!

Recommended Stories

మార్క్ శంకర్ కోసం స్నేక్ పజిల్ కొన్న పవన్ దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే | Handicrafts
ఎలక్షన్ ముందు అడిగారు వెంటనే అది చేయండి: పవన్ | Handicrafts Festival 2026 Stalls