జగన్ కొలువులో ధనంజయ్ రెడ్డి: సిఎం సిఎస్ గా నియామకం

Published : May 25, 2019, 03:30 PM IST
జగన్ కొలువులో ధనంజయ్ రెడ్డి: సిఎం సిఎస్ గా నియామకం

సారాంశం

ముఖ్యమంత్రి కార్యదర్శిగా ధనంజయ్ రెడ్డి శనివారం నియమితులయ్యారు. 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నప్పటికీ తన కార్యదర్శిగా ధనంజయ్ రెడ్డిని నియమించుకున్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కొలువులోకి తొలి అధికారిని తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ధనంజయ్ రెడ్డి శనివారం నియమితులయ్యారు. 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నప్పటికీ తన కార్యదర్శిగా ధనంజయ్ రెడ్డిని నియమించుకున్నారు. 

సీనియర్ ఐఎఎస్ అధికారి అయిన ధనంజయ్ రెడ్డికి మంచి పేరు ఉంది. పాలనాదక్షుడిగా కూడా పేరుంది. ఉత్తరాంధ్ర జిల్లాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆయన గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ పదవి నుంచి ఆయన ఇటీవల పర్యాటక శాఖకు బదిలీ అయ్యారు. 

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించే ఉద్దేశంతోనే ఆయన ధనంజయ రెడ్డిని తన కార్యదర్శిగా నియమించుకున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు