ఉత్తరాంధ్రపై జగన్‌కు ఎందుకంత కోపం: దేవినేని ఉమ

Published : Jun 29, 2019, 11:34 AM IST
ఉత్తరాంధ్రపై జగన్‌కు  ఎందుకంత కోపం: దేవినేని ఉమ

సారాంశం

ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఎందుకంత కోపమో చెప్పాలని  మాజీ మంత్రి  దేవినేని ఉమ మహేశ్వరరావు కోరారు.

విజయవాడ: ఉత్తరాంధ్రపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఎందుకంత కోపమో చెప్పాలని  మాజీ మంత్రి  దేవినేని ఉమ మహేశ్వరరావు కోరారు.

శనివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టు పనులను ఎందుకు నిలిపివేశారో చెప్పాలన్నారు. బహుదా- వంశధార అనుసంధానం పనులను నిలిపివేశారన్నారు. తోటపల్లి గురించి ఇద్దరు సీఎంల సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు నిలిపివేశారని  ఆయన గుర్తు చేశారు. వైకుంఠపురం బ్యారేజీ పనులు కూడ నిలిపివేసినట్టుగా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు పనుల నిలిపివేత గురించి జగన్ మౌనంగా ఉండడం సరైంది కాదన్నారు. గోదావరి- పెన్నా నదుల అనుసంధానం పనులు నిలిచిపోయాయని చెప్పారు.

512 టీఎంసీల నికర జలాలపై ఏపీ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దేవేనేని ఉమ ఏపీ సీఎం జగన్‌కు సూచించారు.

PREV
click me!

Recommended Stories

ప్రపంచ స్థాయి ఫెసిలిటీస్‌తో భోగాపురం ఎయిర్‌పోర్ట్ | Alluri Sitarama Raju International Airport
కడుపుకి గడ్డి తింటున్నావా సీఎం చంద్రబబుపై జగన్ సంచలన కామెంట్స్| YS Jagan Presmeet at Srikakulam