
ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా దర్శించారు. థొమాల సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.