జగన్ పై సీపీఐ రామకృష్ణ సంచలన కామెంట్స్

First Published Jun 25, 2018, 3:09 PM IST
Highlights

జనసేన భవిష్యత్తుపై కూడా

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరని సీపీఐ నేత  రామకృష్ణ జోస్యం చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పై మండిపడ్డారు. 

 జగన్ ధ్యాసంతా ముఖ్యమంత్రి పీఠం మీదే ఉందని విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని కొల్లగొట్టారని, ఏపీకి జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని ఆయన అన్నారు. వైసీపీతో కలిస్తే జనసేన కథ ముగిసినట్లేనని రామకృష్ణ పేర్కొన్నారు.

click me!