తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో నాటు బాంబు పేలుడు: స్థానికుల్లో భయాందోళనలు

Published : Apr 01, 2021, 10:19 AM IST
తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో నాటు బాంబు పేలుడు: స్థానికుల్లో భయాందోళనలు

సారాంశం

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఆవరణలో గురువారం నాడు ఉదయం  రెండు నాటు బాంబులు పేలాయి. దీంతో అక్కడే ఉన్న ఓ శునకం చనిపోయింది. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలంలో తనిఖీలు చేస్తున్నారు.

తిరుపతి: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ఆవరణలో గురువారం నాడు ఉదయం  రెండు నాటు బాంబులు పేలాయి. దీంతో అక్కడే ఉన్న ఓ శునకం చనిపోయింది.
విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలంలో తనిఖీలు చేస్తున్నారు.

ఎస్వీ యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఇవాళ ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. అడవి పందుల కోసం ఈ నాటు బాంబులను ఏర్పాటు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నాటు బాంబులు పేలడంతో ఓ కుక్క, పంది అక్కడికక్కడే మరణించాయి. బాంబు పేలడంతో విన్పించిన శబ్దంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.

ఈ నాటు బాంబులను ఎవరు ఇక్కడ అమర్చారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలు బాంబులను అమర్చిన వారికి ఆ బాంబులు ఎక్కడి నుండి వచ్చాయనే విషయాలపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. బాంబు పేలుడు సంబవించిన సమయంలో ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే కుక్క, పంది మరణించాయి.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu