తప్పుడు సర్వేతో లగడపాటికి చిక్కులు: పోలీసులకు ఫిర్యాదు

Published : May 27, 2019, 11:44 AM IST
తప్పుడు సర్వేతో లగడపాటికి చిక్కులు: పోలీసులకు ఫిర్యాదు

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. లగడపాటి తప్పుడు సర్వే వల్ల అనేక మంది నష్టపోయారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.

ఏలూరు: తప్పుడు ఎగ్జిట్ పోల్ సర్వే కారణంగా మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చిక్కుల్లో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన సర్వే పూర్తిగా తలకిందులవుతూ టీడీపి మట్టి కొట్టుకుపోయింది. 

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. లగడపాటి తప్పుడు సర్వే వల్ల అనేక మంది నష్టపోయారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు. లగడపాటి తప్పుడు సర్వేల వెనుక ఎవరు ఉన్నారో తేల్చానని ఆయన పోలీసులను కోరారు.

మురళీకృష్ణ ఫిర్యాదుపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా లగడపాటి రాజగోపాల్ అంచనా తప్పిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్