దావోస్‌లో ఏపీ పెవిలియన్ ప్రారంభించిన జగన్... సూటు బూటుతో సరికొత్త లుక్‌లో సీఎం

By Siva KodatiFirst Published May 22, 2022, 5:04 PM IST
Highlights

స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ఈడబ్ల్యూఎఫ్) సదస్సులో భాగంగా ఏపీ పెవిలియన్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సదస్సు సందర్భంగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ తో సీఎం సమావేశమయ్యారు. 

స్విట్జర్లాండ్‌లోని (switzerland) దావోస్‌లో జరుగుతున్న (jagan davos tour) ప్రపంచ ఆర్ధిక సదస్సులో (world economic forum summit 2022)  ఏపీ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను (ap pavilion) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) ఆవిష్కరించారు. ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసిన సీఎం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు. అంతకుముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సమావేశంలో జగన్  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఫోరం సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాస్ ష్వాప్‌తో జగన్ భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ కాయల వెంకట రెడ్డి తదితరులు వున్నారు. ఇకపోతే.. డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరయ్యేందుకు సీఎం జగన్ సరికొత్త గెటప్ లో దర్శనమిచ్చారు. ఖద్దరు దుస్తులు కాకుండా.. సూటుబూటు ధరించిన జగన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read:లండన్‌లో జగన్‌ ల్యాండింగ్‌ ‌: ఇది ప్రీ ప్లాన్డ్ టూర్.. బుగ్గనవి అబద్ధాలే, అయ్యన్నపాత్రుడు కౌంటర్

మరోవైపు.. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం లండన్‌లో ల్యాండ్ అవ్వడంపై వివాదం కొనసాగుతూనే వుంది. దీనిపై శనివారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy)క్లారిటీ ఇచ్చినా ప్రతిపక్ష టీడీపీ (tdp) మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా బుగ్గన ఇచ్చిన వివరణపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (ayyanna patrudu) మండిపడ్డారు. రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన‌వ‌న్నీ అస‌త్యాలేన‌ని ఆయన ఎద్దేవా చేశారు . ఈ ఈమేరకు ఆదివారం అయ్యన్న ట్వీట్ చేశారు. 

''జగన్ రెడ్డి లండన్ టూర్ పై బుగ్గన పచ్చి అబద్ధాలతో దొరికిపోయాడు. జగన్ రెడ్డికి ఫ్లైట్ పర్మిషన్ లేక లండన్ వెళ్లాడు అనేది పచ్చి అబద్ధం. జ్యూరిక్‌ ఎయిర్ పోర్ట్ సమాచారం ప్రకారం మే 17నే, లండన్ లోని లూటన్ ఎయిర్ పోర్ట్ నుంచి, జ్యూరిక్‌ దగ్గరలోనే బాసిల్ కు, జగన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఈ 190 ఫ్లైట్ వస్తుందని సమాచారం ఇచ్చారు. ఇది ముందే ప్రీ ప్లాన్డ్ టూర్.. మే 17నే సమాచారం ఉంది. ఇప్పుడు ఏమి చెబుతావ్ బుగ్గన? చెప్పు ఏ బుర్ర కథ చెబుతావో'' అని అయ్య‌న్న పాత్రుడు నిల‌దీశారు.

click me!