రేపటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. శనివారం విశాఖ శారదా పీఠాధిపతి వార్షికోత్సవ కార్యక్రమంతో పాటు మరిన్ని అధికార కార్యక్రమాలలో జగన్ పాల్గొనాల్సి వుంది.
రేపటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. అయితే దీనికి గల కారణాలు తెలియరాలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. శనివారం విశాఖ శారదా పీఠాధిపతి వార్షికోత్సవ కార్యక్రమంతో పాటు మరిన్ని అధికార కార్యక్రమాలలో జగన్ పాల్గొనాల్సి వుంది. అలాగే ఐపీఎస్ అధికారి విద్యా సాగర్ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో సీఎం జగన్ ఆశీర్వదించనున్నారు. అయితే జగన్ కార్యక్రమం అనూహ్యంగా వాయిదాపడింది. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.