
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు, కడప జిల్లాల్లో బిజీ పర్యటన చేపట్టనున్నారు. వింజమూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో మమేకమవుతారు. అనంతరం ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో సతీసమేతంగా పాల్గొని పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు.