ఎన్టీఆర్ జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు..

Published : Aug 02, 2022, 01:36 PM IST
ఎన్టీఆర్ జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరికి తీవ్ర గాయాలు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడులో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడులో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు.. ఎనికెపాడులో విద్యార్థులు సాయి, కార్తీక్‌ల మధ్య ఘర్షణ చోటుచేసకుంది. ఈ క్రమంలోనే కార్తీక్ కత్తితో సాయిపై దాడి చేశాడు. కత్తితో సాయి పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సాయిని.. ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం సాయి పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏమిటి?, ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. 

మరోవైపు విద్యార్థుల మధ్య గొడవకు అమ్మాయి విషయమే కారణమనే ప్రచారం సాగుతుంది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనపై సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Markapuram Bus Accident:మార్కాపురంలో ఘోర ప్రమాదం | Chandrababau | Pawan Kalyan | Asianet News Telugu
AP Bus Accident : మార్కాపురం బస్సు యాక్సిడెంట్ లో తప్పెవరిది..? ప్రమాదమని తెలిసీ ప్రయాణమా..?