మైనర్ బాలికపై సీఐ కారు డ్రైవర్ అత్యాచారయత్నం

First Published Jul 10, 2018, 4:14 PM IST
Highlights

దేశవ్యాప్తంగా చిన్నారులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మహిళలు, చిన్నారుల కోసం ఎన్ని కఠిన చట్టాలు రూపొందించిన ఈ దారుణాలు ఆగడం లేదు. ఈ చట్టాల గురించి తెలిసిన వ్యక్తులే ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఆందోళకకరమైన విషయం.

దేశవ్యాప్తంగా చిన్నారులపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మహిళలు, చిన్నారుల కోసం ఎన్ని కఠిన చట్టాలు రూపొందించిన ఈ దారుణాలు ఆగడం లేదు. ఈ చట్టాల గురించి తెలిసిన వ్యక్తులే ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఆందోళకకరమైన విషయం.

తాజాగా ఓ మైనర్ బాలికపై  గుంటూరు జిల్లాలో ఓ కారు డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. గుంటూరు పట్టణంలో నివాసముండే ఓ సీఐ వద్ద నిందితుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడు బాలికపై అత్యాచారయత్నం చేయగా భచపడిపోయిన చిన్నారి గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చేలోపు నిందితుడు పరారయ్యాడు.

ఈ ఘటనపై స్థానికులు నల్లపాడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పట్టాభిపురం సీఐ గా డ్రైవర్ జానీ గా గుర్తించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!