
దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు నిర్వహించిన మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం చూడండి. కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి (Mega DSC) నియామకాలపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ (గొడ్డలి పార్టీ) తప్పుడు వార్తలతో గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల పాలనలో డిఎస్సి వేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన జగన్ పార్టీకి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేలాది ఉద్యోగాలు ఇస్తుంటే ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.