ఒంగోలులో డ్రగ్స్ కలకలం: ఇద్దరిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

Published : Mar 08, 2022, 12:06 PM IST
ఒంగోలులో డ్రగ్స్ కలకలం: ఇద్దరిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

సారాంశం

ప్రకాశం జిల్లా ఒంగోలులో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఒంగోలులో గోడౌన్ పై పోలీసులు దాడి చేశారు.

ఒంగోలు: Prakasam  జిల్లా Ongole శివారులోని పారిశ్రామికవాడలో గోడౌన్ తయారు చేస్తున్న ఇద్దరిని Chennai పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం చెన్నైలో డ్రగ్స్ తయారు చేస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. drugs తయారు చేస్తున్న ముఠాను విచారిస్తే ఒంగోలులో డ్రగ్స్ తయారీ విషయం వెలుగు చూసింది.

ఒంగోలులోని పారిశ్రామిక వాడలో ఓ గోడౌన్ ను రసాయనాలు తయారు చేసేందుకు హైద్రాబాద్ కు చెందిన Vijay Venkat Reddyలు లీజుకు తీసుకున్నారు. ఈ గోడౌన్ లో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. చెన్నై పోలీసులు సోమవారం నాడు రాత్రి గోడౌన్ పై దాడి చేశారు. ఈ గోడౌన్ ను లీజుకు తీసుకొన్న వెంకట్ రెడ్డి, విజయ్ లను చెన్నై పోలీసులు  Arrest చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu