
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. తిరుమల అడవుల్లో అప్పుడప్పుడు చిరుతలు, పెద్దపులులు కనిపించటం మామూలే. ఒంటిరిగా కనిపించిన భక్తులపై దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే భక్తులు జాగ్రత్తగా ఉండాలని టిడిపి ఉన్నతాధికారులు హెచ్చరిస్తుంటారు. తాజాగా ఓ చిరుతపులి తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కనిపించింది. తమిళనాడుకు చెందిన భక్తులెవరో కారులో తిరుమల పైకి వెళుతుంటే హటాత్తుగా చిరుతపులి రోడ్డుపై ప్రత్యక్షమవ్వటంతో బిత్తరపోయారు. అయితే, వారు కారులో కూర్చుని ఉండటంతో తేరుకుని వెంటనే మొబైల్ ఫోన్లో వీడియో తీసారు.