ఈ నెల 19వ తేదీన ప్రధాని నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే విషయంలో టీడీపీ తర్జన భర్జన పడుతోంది. చంద్రబాబు స్థానంలో పార్లమెంటరీ పార్టీ నేతను ఈ సమావేశానికి పంపాలని ఆ పార్టీ భావిస్తోంది.
అమరావతి: ఈ నెల 19వ తేదీన ప్రధాని నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యే విషయంలో టీడీపీ తర్జన భర్జన పడుతోంది. చంద్రబాబు స్థానంలో పార్లమెంటరీ పార్టీ నేతను ఈ సమావేశానికి పంపాలని ఆ పార్టీ భావిస్తోంది.
జమిలీ ఎన్నికలపై ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఆయా పార్టీల అధ్యక్షులకు ఇప్పటికే లేఖలు పంపారు. అయితే ఈ సమావేశానికి చంద్రబాబునాయుడు హాజరయ్యే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
బుధవారం నుండి ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నెల మొదటి వారంలోనే చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్లాలని భావించారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున తన పర్యటనను వాయిదా వేసుకొన్నారు.
బుధవారం నుండి చంద్రబాబునాయుడు వారం రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు.చంద్రబాబుకు బదులుగా ఈ సమావేశానికి టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను పంపాలని ఆ పార్టీ ఆలోచనగా కన్పిస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.