ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

Published : Jun 04, 2019, 06:11 PM IST
ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ

సారాంశం

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో  ఘోరంగా ఓటమి పాలు కావడం, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలపై చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్షించనున్నారు.

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మంగళవారం నాడు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో  ఘోరంగా ఓటమి పాలు కావడం, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలపై చంద్రబాబు పార్టీ నేతలతో సమీక్షించనున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసే విషయమై పార్టీని బలోపేతం చేసే విషయమై పార్టీ నేతలతో బాబు చర్చిస్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలపై కూడ చర్చించే అవకాశం లేకపోలేదు.

మరో వైపు ఈ నెల 7వ తేదీ నుండి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు కుటుంబసభ్యులతో చంద్రబాబు విదేశాల్లో గడుపుతారు. ఈ నెల 14 వ తేదీన బాబు ఇండియాకు తిరిగి వస్తారు.
 

PREV
click me!

Recommended Stories

మహానాడు లో మంత్రి నిమ్మల పవర్ ఫుల్ స్పీచ్ | Nimmala Ramanaidu Speech | Asianet News Telugu
అమెరికాలో మహానాడు చంద్రబాబుపై ప్రశంసలు | Mahanadu 2026 | Asianet News Telugu