అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వచ్చే 90 రోజుల్లో పలు కీలక కార్యక్రమాలు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.