మీరు తీసుకొన్న గోతిలో మీరే పడతారు: వైసీపీపై చంద్రబాబు

Published : Dec 02, 2020, 03:33 PM IST
మీరు తీసుకొన్న గోతిలో మీరే పడతారు:  వైసీపీపై చంద్రబాబు

సారాంశం

పోలవరం ప్రాజెక్టు విషయమై అధికార, విపక్షాల మధ్య  బుధవారం నాడు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. 

అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయమై అధికార, విపక్షాల మధ్య  బుధవారం నాడు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. పోలవరంపై  చర్చను ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ ప్రారంభించారు.  ఆ తర్వాత అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రసంగించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై  అనుమానాలు వ్యక్తమౌతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం  విషయంలో తమ ప్రభుత్వం  హయంలో తీసుకొన్న నిర్ణయాలను చంద్రబాబు వివరించారు.

also read:పోలవరం ప్రాజెక్టును వివాదంలోకి లాగుతున్నారు: బాబు, కౌంటరిచ్చిన మంత్రి అనిల్

ముంపు మండలాలను  ఏపీలో కలిపితేనే ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.పోలవరం విషయంలో ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. మీరు తీసుకొన్న గోతిలో మీరే పడతారని చంద్రబాబు వైసీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం సాగింది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.

ఆ తర్వాత పోలవరం ఎమ్మెల్యే  ఇదే అంశంపై మాట్లాడారు. ఈ సమయంలో చంద్రబాబుకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని టీడీపీ సభ్యులు  స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల నిరసనలు సాగుతున్న సమయంలోనే ఏపీ సీఎం జగన్ పోలవరంపై సమాధానం చెప్పారు.

PREV
click me!

Recommended Stories

నెల్లూరులో కాకాని ఆద్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు | Kakani Govardhan Reddy | Asianet News Telugu
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు వెన్నుపోటుకు రెండేళ్లు YSRCP Protest in Vijayawada | Asianet Telugu