ఆ రోజు పవన్ కల్యాణ్ తో అంతే జరిగింది: చంద్రబాబు

Published : Jun 26, 2018, 01:09 PM IST
ఆ రోజు పవన్ కల్యాణ్ తో అంతే జరిగింది: చంద్రబాబు

సారాంశం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తాను గుంటూరు ఓ ఆలయంలో కలిసిన విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంత ఇచ్చారు.

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తాను గుంటూరు ఓ ఆలయంలో కలిసిన విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంత ఇచ్చారు. హలో అంటే హలో అనుకున్నామని, అంతకు మించి ఏమీ జరగలేదని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీలో మంగళవారం ఆయన ఆ విషయాన్ని ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ తో రాజకీయ చర్చలేవీ జరగలేదని, ఈ విషయంలో పార్టీ నాయకులకు స్పష్టత ఉండాలని అన్నారు. 

బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వైసిపి సొంత మైకులా, బిజెపికి అద్దె మైకులా తయారయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఇక బిజెపి సాయం రాదన్నట్లుగా కన్నా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha in Tirumala: కొత్త పార్టీ పడతా: కవిత | Asianet News Telugu
ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి బంపరాఫర్ | CM Chandrababu on AP Population | Asianet News Telugu