మనపై పడేవారు: యడ్యూరప్ప రాజీనామాపై చంద్రబాబు ఖుషీ

Published : May 19, 2018, 05:08 PM IST
మనపై పడేవారు: యడ్యూరప్ప రాజీనామాపై చంద్రబాబు ఖుషీ

సారాంశం

శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడకుండా యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి ముందే రాజీనామా చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందంగా ఉన్నట్లు అర్థమవుతోంది.

విజయవాడ: శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడకుండా యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి ముందే రాజీనామా చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆనందంగా ఉన్నట్లు అర్థమవుతోంది.

యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత దానిపై చంద్రబాబు స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించిన వారు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారని ఆయన యడ్యూరప్ప రాజీనామాపై వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికో విధానం అన్నట్లుగా బిజెపి వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఎపికి అన్యాయం చేసినవారిని మట్టి కరిపించాలని తాను పిలుపునిచ్చిన విషయాన్ని ఆయ గుర్తు చేశారు. కర్ణాటక అయిపోయి ఉంటే ఆ తర్వాత తమపై పడి ఉండేవారని ఆయన బిజెపిపై వ్యాఖ్యానించారు. 

సాధికార మిత్ర కమిటీలో ఆయన యడ్యూరప్ప రాజీనామాపై స్పందించారు. యడ్యూరప్ప రాజీనామా ప్రజాస్వామ్య విజయమని ప్రధాని, బిజెపి నేతలు రంగంలోకి దిగినా విజయం సాధించలేకపోయారని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Chief Justice of India Justice Surya Kant Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో జస్టిస్ సూర్యకాంత్
Bhumana Karunakar Reddy Comments on BR Naidu: బీఆర్ నాయుడుపై భూమన సెటైర్లు| Asianet News Telugu