కుప్పంలో చంద్రబాబు సొంతిళ్లు.. జూన్ 5న భూమి పూజ...

Published : May 13, 2022, 09:55 AM IST
కుప్పంలో చంద్రబాబు సొంతిళ్లు.. జూన్ 5న భూమి పూజ...

సారాంశం

చంద్రబాబునాయుడు కుప్పంలో సొంత ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కొన్నారు. దీనికి సంబంధించిన స్థలం రిజిస్ట్రేషన్ ఫారాలపై సంతకాలు చేశారు. జూన్ 5న ఇంటి నిర్మాణానికి భూమి పూజ.

కుప్పం : కుప్పంలో chandrababu naidu సొంత ఇల్లు నిర్మించుకుంటే చూడాలన్న నియోజకవర్గ ప్రజల కల త్వరలోనే తీరనుంది. దీనికి అవసరమైన Place registration కోసం సంబంధిత పత్రాలపై ఆయన సంతకం కూడా అయిపోయింది. పార్టీ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం... కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం ఎదురుగా 2.10 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు Own House నిర్మాణం కోసం కొనాలని నిర్ణయించారు.

కుప్పం పర్యటనకు వచ్చిన చంద్రబాబు గురువారం ఉదయం ఆ స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేసి వేలిముద్రలు వేశారు. ఈ నెల 29న స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 5న చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితో కుప్పం వచ్చి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఇక్కడ గృహంతో పాటు పార్టీ సమావేశాల కోసం ప్రత్యేకంగా కార్యాలయం భవనం కూడా నిర్మించనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ముద్రగడ పద్మనాభం ఇకలేరు | Mudragada Padmanabham Passes Away | Kapu Leaders Pressmeet
విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour