జగన్ రెడ్డి సైకో, ఉన్మాది.. అతని చర్యలతో రాష్ట్రం నాశనం.. : చంద్రబాబు నాయుడు

By AN TeluguFirst Published Jan 25, 2021, 2:17 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేతనారా చంద్రబాబు నాయుడు సోమవారం టిడిపి నాయకులతో వీడియో కాన్పరెన్స్  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, క్లస్టర్, మండల కమిటిల బాధ్యులు పాల్గొన్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేతనారా చంద్రబాబు నాయుడు సోమవారం టిడిపి నాయకులతో వీడియో కాన్పరెన్స్  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, క్లస్టర్, మండల కమిటిల బాధ్యులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘45డివిజన్లలో తొలిదశ పంచాయితీ ఎన్నికల ప్రక్రియ నేటినుంచి ప్రారంభమవుతుంది. అన్ని గ్రామాల్లో నామినేషన్లు పడేలా చూడాలి. బలవంతపు ఏకగ్రీవాలు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలి. అభ్యర్ధులంతా సంబంధిత సర్టిఫికెట్లు సిద్దం చేసుకోవాలి. నేటివిటి సర్టిఫికెట్లు, కాస్ట్ సర్టిఫికెట్లు, నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. 

ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ. ఈసి ఆదేశాలను ధిక్కరించడం రాజ్యాంగ ఉల్లంఘనే. చట్టాలను పాటించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం మనందరి బాధ్యత. వినాశకాలే విపరీత బుద్దిలా జగన్ రెడ్డి ధోరణి ఉంది అని మండిపడ్డారు. 

జగన్ రెడ్డి ఒక సైకో, ఉన్మాద మనస్తత్వం. అతని చర్యలతో రాష్ట్రం నాశనం అవుతోంది. ప్రజల్లో అశాంతి, అభద్రత నెలకొంది. సిఎం ఇంటి ముట్టడి చేస్తే అత్యాచార యత్నం కేసు సిగ్గుచేటు. ఫీజుల కోసం ఆందోళన చేసే విద్యార్ధులపై రేప్ కేసులా..? రైతుల చేతులకు బేడీలు వేయడం ఎప్పుడైనా జరిగిందా..? ఎస్సీలపై, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడం ఎక్కడైనా ఉందా..? అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. 

వైసిపి దుర్మార్గాలపై రాజీలేని పోరాటం చేయాలి. వీరోచితంగా పోరాడేవాళ్లు అందరికీ అభినందనలు. పంచాయితీ ఎన్నికలంటే వైసిపి పారిపోతోంది. నిష్పాక్షిక ఎన్నికలు జరిగితే ఓడిపోతామనేదే వైసిపి భయం. బాధిత బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటి ప్రజలంతా ఏకమై బుద్ది చెబుతారనే భయంతోనే ఎన్నికలకు మోకాలడ్డుతోంది. బాధిత రైతులు, రైతుకూలీలంతా సంఘటితమై ఓడిస్తారనే భయంతోనే వెనుకంజ వేస్తోందన్నారు.
 
జగన్ రెడ్డి వేధింపులు, బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇంకా కొన్ని రోజులు పోతే అందరూ ఛీకొట్టే పరిస్థితి వస్తుంది. శాసనమండలి రద్దు, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు,  ఎన్నికల సంఘంపై దాడి, ఎన్నికల కమిషనర్ పై దుర్భాషలు, న్యాయస్థానాలపై దాడి, న్యాయమూర్తులపై దుర్భాషలు, మీడియాపై అణిచివేత.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టిన వాళ్లు చేసే చర్యలు కాదంటూ విమర్శించారు. 

రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నాడు అనే ఆవేదన ప్రజల్లో ఉంది. నామినేషన్లు స్వీకరించని చోట్ల, అధికారులపై ఫిర్యాదులు చేయాలి, ఆ ఫిర్యాదులను గోడలకు అతికించాలి. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వాలి. ఆయా ఫోటోలు, వీడియో సాక్ష్యాధారాలతో ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, జిల్లా పంచాయితీ అధికారికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలి. అధికారుల సహాయ నిరాకరణపై, గైర్హాజరుపై రాష్ట్ర గవర్నర్ కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదులు పంపాలని తెలిపారు. 
 
regjudaphc@nic.in మరియు  governor@ap.nic.in   మరియు secy.apsec@gmail.com  లకు మెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపాలన్నారు. ‘‘ఈసి నోటిఫికేషన్ ప్రకారం మేము నామినేషన్లు ఇవ్వడానికి వెళ్లాము, అక్కడ ఎవరూ లేరనే’’ ఫిర్యాదులను అందరికీ పంపించాలి. 

రేపటి గణతంత్ర దినం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణలో అందరూ పాల్గొనాలి. జెండా ఆవిష్కరణల తర్వాత, వైసిపి ఉన్మాద పాలనను, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండించాలి. ప్రాథమిక హక్కులు కాలరాయడాన్ని, చట్టాలకు తూట్లు పొడవడం, రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడటంపై ధ్వజమెత్తాలని’’ చంద్రబాబు పిలుపునిచ్చారు. 

చంద్రబాబు తరువాత టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ..  అభ్యర్ధులంతా నామినేషన్ల పత్రాలతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలి, తీసుకోకపోతే ఫోటోలు, వీడియో తీసి మీడియాకు పంపాలి. నూటికి నూరుశాతం అన్నిగ్రామాల్లో నామినేషన్లు వేయాలి. డమ్మీల నామినేషన్లు కూడా సమర్పించాలి. ఎక్కడా బలవంతపు ఏకగ్రీవాలు లేకుండా చూడాలి. అధికారం అండతో వైసిపి జులుం చేయాలని చూస్తే ఫోటో, వీడియో సాక్ష్యాధారాలను అధికారులతోపాటు టిడిపి కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు.

ఇక మరో నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్లో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి, పార్టీ లీగల్ సెల్ దృష్టికి తేవాలి. 

ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు డి జగదీష్, టిడి జనార్దన్, మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, శ్రావణ్ కుమార్, చెంగల్రాయుడు, గన్ని వీరాంజనేయులు, అనంతకుమారి, చింతకాయల విజయ్, వెంకటపతిరాజు తదితరులు మాట్లాడారు.

click me!