వైఎస్ వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ టెస్ట్: అనుమతిచ్చిన కోర్టు

Published : Jun 07, 2023, 04:22 PM ISTUpdated : Jun 07, 2023, 04:41 PM IST
 వైఎస్ వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ టెస్ట్:  అనుమతిచ్చిన  కోర్టు

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  రాసిన లేఖపై  నిన్ హైడ్రిన్  పరీక్షకు   కోర్టు అనుమతిని ఇచ్చింది.  


హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్  వివేకానందరెడ్డి  రాసిన లేఖపై నిన్ హైడ్రిన్  పరీక్షకు కోర్టు  బుధవారంనాడు అనుమతిని  ఇచ్చింది.హత్యకు గురయ్యే ముందు  వైఎస్ వివేకానందరెడ్డి  రాసినట్టుగా చెబుతున్న లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు గాను  నిన్ హైడ్రిన్  పరీక్ష నిర్వహణకు అనుమతి  కోసం  సీబీఐ  అధికారులు   ఈ ఏడాది మే  12  సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ విషయమై  నాంపల్లి సీబీఐ  కోర్టు  ఇవాళ  నిర్ణయం తీసుకుంది. 

2019  ఏప్రిల్  14వ తేదీ  రాత్రి  వైఎస్  వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. అయితే  హత్యకు  ముందు  వైఎస్ వివేకానందరెడ్డి  రాసినట్టుగా  ఉన్న లేఖ  లభ్యమైంది. ఈ లేఖపై ఇప్పటికే  2021  ఫిబ్రవరి 21న  ఢిల్లీలోని  సీఎఫ్ఎస్ఎల్  ఒక నివేదికను ఇచ్చింది.  తీవ్ర ఒత్తిడిలో  ఉన్న సమయంలో  వైఎస్ వివేకానందరెడ్డి ఈ లేఖ  రాసినట్టుగా  ఆ నివేదిక తెలిపింది. అయితే  వైఎస్  వివేకానందరెడ్డి  రాసిన లేఖపై  వేలిముద్రలను గుర్తించేందుకు   నిన్ హైడ్రిన్  పరీక్ష  నిర్వహణకు  గాను  సీబీఐ  నిర్ణయం  తీసుకొంది. ఈ మేరకు కోర్టు అనుమతిని  కోరింది.  సీబీఐ  అభ్యర్ధనకు కోర్టు  తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu