టిడిపి ఎమ్మెల్సీపై కేసు

Published : Mar 22, 2018, 04:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
టిడిపి ఎమ్మెల్సీపై కేసు

సారాంశం

ఆంధ్రప్రదేశ లో అధికార టీడీపీ నేతలపై కేసులు పెరిగిపోతున్నాయి

ఆంధ్రప్రదేశ లో అధికార టీడీపీ నేతలపై కేసులు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్నపుడు అవినీతికి పాల్పడటం తర్వాత కేసుల్లో ఇరుక్కోవటం మామూలైపోయింది. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్సీపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారిపై 2012-2013 ఆర్ధిక సంవత్సరంలో రూ.26.3 లక్షల స్త్రీనిధి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో పదిమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితులపై కోటనందూరు పోలీసులు సెక్షన్ 409, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

స్పీచ్ మధ్యలో ఎమోషనల్ అయిన బాబు | CM Chandrababu Speech @puthalapattu | Asianet Telugu
YS Jagan VS Chandrababu | ముగ్గురు పిల్లల్ని కనడంపై | Asianet News Telugu