టిడిపి ఎమ్మెల్సీపై కేసు

Published : Mar 22, 2018, 04:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
టిడిపి ఎమ్మెల్సీపై కేసు

సారాంశం

ఆంధ్రప్రదేశ లో అధికార టీడీపీ నేతలపై కేసులు పెరిగిపోతున్నాయి

ఆంధ్రప్రదేశ లో అధికార టీడీపీ నేతలపై కేసులు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్నపుడు అవినీతికి పాల్పడటం తర్వాత కేసుల్లో ఇరుక్కోవటం మామూలైపోయింది. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్సీపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారిపై 2012-2013 ఆర్ధిక సంవత్సరంలో రూ.26.3 లక్షల స్త్రీనిధి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో పదిమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితులపై కోటనందూరు పోలీసులు సెక్షన్ 409, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!