టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై తేలిన లెక్కలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే ?

Published : Mar 09, 2024, 03:01 PM IST
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై తేలిన లెక్కలు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే ?

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారు అయ్యింది. ఆ పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది.

ఎట్టకేలకు టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఖరారు అయ్యింది. దీంతో చాలా కాలంగా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాన్ చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కినట్టు అయ్యింది. శనివారం ఉదయం నుంచి ఆ ఇద్దరు నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన పొత్తుకు అంగీకారం తెలిపారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే విషయం కూడా ఈ సమావేశంలో స్పష్టత వచ్చింది.

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఏకకాలంలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీట్ల సర్దుబాటు జరిగింది. అయితే 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికంగా సీట్లు తీసుకోబోతోంది. జనసేన-బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేనకు 24 సీట్లు ఇది వరకే ఉండగా.. బీజేపీకి 6 సీట్లు వచ్చాయి. అలాగే బీజేపీకి 6 లోక్ సభ స్థానాలు, జనసేనకు 2 లోక్ సభ స్థానాలు కేటాయించారు. 

ఈ సీట్ల సర్దుబాటు విషయంలో అమిత్‌షాతో చంద్రబాబు చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. అయితే సాయంత్రం ఈ పొత్తులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్