Breaking News : పెంచలకోన జలపాతం వద్ద 11 మంది గల్లంతు .. రంగంలోకి సహాయ బృందాలు

By Siva KodatiFirst Published Nov 29, 2023, 7:38 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. జలపాతం సందర్శనకు వెళ్లిన 11 మంది పర్యాటకులు గల్లంతయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. జలపాతం సందర్శనకు వెళ్లిన 11 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ఎగువ నుంచి ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తడంతో పర్యాటకులు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!