
మెగా డీఎస్సీలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా అక్రమాలకు పాల్పడిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మెగా డీఎస్సీని కాస్తా దగా డీఎస్సీగా మార్చేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, బాధితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి లోక్భవన్లో గవర్నర్ అబ్ధుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం లోక్భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు.