బ్రేకింగ్: శబరి నదిలో లాంచీ మునక... పలువురి గల్లంతు..?

Siva Kodati |  
Published : Aug 20, 2020, 08:19 PM ISTUpdated : Aug 20, 2020, 08:23 PM IST
బ్రేకింగ్: శబరి నదిలో లాంచీ మునక... పలువురి గల్లంతు..?

సారాంశం

తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు  చేసుకుంది. చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీకొట్టిన  ఓ లాంచీ అనంతరం నదిలో మునిగిపోయింది

తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు  చేసుకుంది. చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీకొట్టిన  ఓ లాంచీ అనంతరం నదిలో మునిగిపోయింది. లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం.

చీమ్మచీకటి కావడంతో లాంచీలో ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి  నెలకొంది. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ సహాయక బృందాలు ఘటాన స్థలికి చేరుకుంటున్నాయి., 

కల్లేరు పంచాయితీకి సరుకులు అందించి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లర్ ను గుద్దుకొని రెండు ముక్కలైన లాంచీ. దీనితో లాంచీలో ఉన్న ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు.

PREV
click me!

Recommended Stories

Chandrababu: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలవరం డెడ్‌లైన్ ఫిక్స్.. ఆ జిల్లాకు గోదావరి జలాలు
CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu