ఏపీలో ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీ.. అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్ల ప్రకటన..

Published : Mar 28, 2023, 02:02 PM ISTUpdated : Mar 28, 2023, 02:19 PM IST
ఏపీలో ఎన్నికలకు సిద్దమవుతున్న బీజేపీ.. అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్ల ప్రకటన..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే.. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ కన్వీనర్లను బీజేపీ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే.. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ కన్వీనర్లను బీజేపీ ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ నియామకాలకు ఆమోద ముద్ర వేశారు. మొత్తం 175 నియోజకవర్గాలకు గానూ.. 132 స్థానాలకు కన్వీనర్‌లను బీజేపీ నియమించింది. అందులో కొన్నినియోజకవర్గాలకు కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించడం గమనార్హం. మొత్తం 162 మందిని  కన్వీనర్లు, కో కన్వీనర్లుగా నియమించింది. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ పేర్కొంది. 

అయితే ప్రస్తుతం కన్వీనర్లుగా నియమించినవారినే.. రానున్న ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థులుగా బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే పార్టీ బలోపతంలో భాగంగానే ఈ నియామకాలు చేపట్టినట్టుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

 

అయితే బీజేపీ ఏకంగా 132 నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించడం చూస్తుంటే.. ఆ పార్టీ వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దమవుతుందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా? అనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించడం.. ఒంటరిగానైనా దిగేందుకు సిద్దంగా ఉన్నామని బీజేపీ సంకేతాలు పంపినట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!