టీడీపీ వైపు పవన్ ‌గాలి మళ్లిందా: విష్ణుకుమార్ రాజు

Published : Jan 21, 2019, 06:33 PM ISTUpdated : Jan 21, 2019, 06:35 PM IST
టీడీపీ వైపు  పవన్ ‌గాలి మళ్లిందా: విష్ణుకుమార్ రాజు

సారాంశం

జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్‌‌పై టీడీపీ నేతల విమర్శలు తగ్గినట్టు కన్పిస్తున్నాయని బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు  చెప్పారు. పవన్ గాలి కూడ మారిందేమోనని  ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు.  


అమరావతి:  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్‌‌పై టీడీపీ నేతల విమర్శలు తగ్గినట్టు కన్పిస్తున్నాయని బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు  చెప్పారు. పవన్ గాలి కూడ మారిందేమోనని  ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు.

సోమవారం నాడు  బీజేపీ శాసనసభపక్షనేత విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు.  పవన్ కళ్యాణ్‌‌పై టీడీపీ నేతలు విమర్శలను తగ్గించారని ఆయన గుర్తు చేశారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలిపారని  టీడీపీ నేతలు విమర్శలు చేసేవారని ఆయన గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం పవన్‌పై విమర్శల జోరును టీడీపీ తగ్గించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు  పవన్ కళ్యాణ్‌కు కూడ టీడీపీపై  కొంత మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు.  మోడీ చేతిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పినవాళ్లంతా ఇప్పుడంతా  కొత్త ట్విస్టులు ఇస్తున్నారన్నారు. ట్విస్ట్‌లు, యూ టర్న్‌లు అధికార పార్టీకి కొత్తేమీ కాదని  చెప్పారు.  
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు