అఖిలప్రియకు షాక్: బీజేపీలో చేరిన సోదరులు మహేష్ , కిషో‌ర్‌ రెడ్డిలు

Published : Jul 26, 2019, 10:48 AM ISTUpdated : Jul 26, 2019, 11:01 AM IST
అఖిలప్రియకు షాక్: బీజేపీలో చేరిన సోదరులు మహేష్ , కిషో‌ర్‌ రెడ్డిలు

సారాంశం

భూమా కుటుంబీకులు  శుక్రవారంనాడు బీజేపీలో చేరారు. భూమా బ్రహ్మనందరెడ్డి, భూమా అఖిలప్రియలు ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఇదే కుటుంబానికి చెందిన మహేష్ రెడ్డి,  కిషోర్ రెడ్డిలు బీజేపీలో చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఆళ్లగడ్డ: భూమా కుటుంబీకులు కమలం గూటికి చేరారు. భూమా కిషోర్ రెడ్డి, మహేష్‌ రెడ్డిలు  శుక్రవారం నాడు బీజేపీలో చేరారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో వీరిద్దరూ బీజేపీలో చేరారు.

భూమా కుటుంబం ఇప్పటివరకు టీడీపీలో ఉంది. అయితే భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి సోదరుడి కొడుకు భూమా బ్రహ్మనందరెడ్డిలు టీడీపీలో ఉన్నారు. 

అయితే ఇదే కుటుంబానికి చెందిన భూమా కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డిలు బీజేపీలో చేరారు. భూమా కుటుంబీకులు కమలం గూటికి చేరారు. కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డి బీజేపీలో చేరారు. జేపీ నడ్డా సమీక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు గతంలో బీజేపీ ఆహ్వానం పలికింది. అయితే ఆమె నుండి  సరైన స్పందన రాని కారణంగా అదే కుటుంబానికి చెందిన వారికి బీజేపీ నాయకత్వం వల వేసింది.  బీజేపీ ప్లాన్ సక్సెస్ అయింది.

రానున్న ఎన్నికల్లో భూమా అఖిలప్రియ గంగుల కుటుంబంతో పాటు తమ కుటుంబానికి చెందిన వారితో కూడ పోటీ పడాల్సిన పరిస్థితులు ఉంటాయా అనే చర్చ కూడ లేకపోలేదు.
 

PREV
click me!

Recommended Stories

Vishnu Kumar Raju Speech: వీటిపై ఇంత తక్కువ డబ్బు కేటాయించడం నేనెప్పుడూచూడలేదు | Asianet News Telugu
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు