బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Published : Jun 04, 2024, 09:24 AM IST
బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

సారాంశం

కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం అయిన బద్వేల్‌లో ఈ సారి వైసీపీ నుంచి దాసరి సుధ, కూటమి నుంచి బీజేపీ అభ్యర్థి బొజ్జ రోషన్న పోటీ పడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి విజయ జ్యోతి పోటీలో ఉన్నారు. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో కాసేపట్లో తెలుస్తుంది.  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో కీలకమైన నియోజకవర్గం బద్వేల్. ఎస్సీలకు ఈ నియోజకవర్గం రిజర్వ్ చేయబడింది. తొలుత 1955 నుంచి 2004 వరకు బద్వేల్ జనరల్ నియోజకవర్గంగా వుండేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ మూడు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించాయి. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కలశపాడు, బీ కొండూర్, శ్రీ అవధూత కాశీనాయ, పోరుమామిళ్ల, బద్వేల్, గోపవరం, అట్లూర్ మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,18,740 మంది. వీరిలో పురుషులు 1,09,618 మంది.. మహిళలు 1,09,115 మంది. 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గుణతోటి వెంకట సుబ్బయ్యకు 95,482 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఓబుళాపురం రాజశేఖర్‌కు 50,748 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 44,734 ఓట్ల మెజారిటీతో బద్వేల్‌ను కైవసం చేసుకుంది. అయితే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో 2021 మార్చి 28న మరణించారు. దీంతో బద్వేల్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య భార్య సుధను వైసీపీ బరిలో దించగా.. టీడీపీ దూరంగా ఎన్నికలకు వుంది. బీజేపీ తరపున సురేష్ పోటీ చేశారు. సుధకు 1,12,211 ఓట్లు.. సురేష్‌కు 21,678 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉప ఎన్నికల్లోనూ వైసీపీ జయకేతనం ఎగరవేసింది. 

బద్వేల్ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. 

వైసీపీ బద్వేల్‌లో మరోసారి విజయం సాధించాలని పట్టుదలతో జగన్‌ ఉన్నారు.  దివంగత సుబ్బయ్య కుటుంబానికే జగన్ టికెట్ కేటాయించారు. సుబ్బయ్య సతీమణి, సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి సుధ మరోసారి పోటీ చేశారు. ఈ సారి టీడీపీ కూడా విజయం సాధించాలని కసితో ఉంది. కానీ కూటమిలో భాగంగా ఈ సారి బీజేపీకి అవకాశం ఇచ్చారు.బీజేపీ నుంచి బొజ్జ రోషన్న పోటీ చేశారు. కాంగ్రెస్‌నుంచి విజయ జ్యోతి బరిలో ఉన్నారు. వీరిలో విజయం ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో క్లారిటీ రానుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?