బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

Siva Kodati |  
Published : Mar 18, 2024, 06:16 PM ISTUpdated : Mar 20, 2024, 04:44 PM IST
బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

సారాంశం

బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కలశపాడు, బీ కొండూర్, శ్రీ అవధూత కాశీనాయ, పోరుమామిళ్ల, బద్వేల్, గోపవరం, అట్లూర్ మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,18,740 మంది. వీరిలో పురుషులు 1,09,618 మంది.. మహిళలు 1,09,115 మంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ మూడు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించాయి. వైసీపీ బద్వేల్‌లో మరోసారి విజయం సాధించాలని పట్టుదలతో వుంది. దివంగత సుబ్బయ్య కుటుంబానికే జగన్ టికెట్ కేటాయించారు. తన ఒకప్పటి కంచుకోటలో పసుపు జెండా ఎగురవేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో కీలకమైన నియోజకవర్గం బద్వేల్. ఎస్సీలకు ఈ నియోజకవర్గం రిజర్వ్ చేయబడింది. తొలుత 1955 నుంచి 2004 వరకు బద్వేల్ జనరల్ నియోజకవర్గంగా వుండేది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, వైసీపీ మూడు సార్లు, ఇతరులు మూడు సార్లు విజయం సాధించాయి. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కలశపాడు, బీ కొండూర్, శ్రీ అవధూత కాశీనాయ, పోరుమామిళ్ల, బద్వేల్, గోపవరం, అట్లూర్ మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,18,740 మంది. వీరిలో పురుషులు 1,09,618 మంది.. మహిళలు 1,09,115 మంది. 

బద్వేల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 ... వైసీపీదే హవా :

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గుణతోటి వెంకట సుబ్బయ్యకు 95,482 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఓబుళాపురం రాజశేఖర్‌కు 50,748 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 44,734 ఓట్ల మెజారిటీతో బద్వేల్‌ను కైవసం చేసుకుంది. అయితే వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో 2021 మార్చి 28న మరణించారు. దీంతో బద్వేల్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య భార్య సుధను వైసీపీ బరిలో దించగా.. టీడీపీ దూరంగా ఎన్నికలకు వుంది. బీజేపీ తరపున సురేష్ పోటీ చేశారు. సుధకు 1,12,211 ఓట్లు.. సురేష్‌కు 21,678 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉప ఎన్నికల్లోనూ వైసీపీ జయకేతనం ఎగరవేసింది. 

బద్వేల్ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో నిలిచేదెవరు :

వైసీపీ బద్వేల్‌లో మరోసారి విజయం సాధించాలని పట్టుదలతో వుంది. దివంగత సుబ్బయ్య కుటుంబానికే జగన్ టికెట్ కేటాయించారు. సుబ్బయ్య సతీమణి, సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి సుధ బరిలో దిగుతున్నారు. అయితే తన ఒకప్పటి కంచుకోటలో పసుపు జెండా ఎగురవేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. బద్వేల్‌లో చివరిసారిగా టీడీపీ 2001 ఉపఎన్నికలో విజయం సాధించింది. కానీ ఈసారి టీడీపీ , జనసేన, బీజేపీ పొత్తు వుండటం.. 2021 ఉపఎన్నికలో బీజేపీ ఇక్కడ పోటీ చేయడంతో బద్వేల్‌లో టీడీపీ అభ్యర్ధిని ప్రకటించకపోవడంతో కమలనాథులు ఏమైనా ఈ సీటును కోరారా అన్నది తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్