తెలుగు జాతికి ఇచ్చిన వారెంట్‌గా భావిస్తున్నా: మంత్రి అచ్చెన్నాయుడు

Published : Sep 14, 2018, 08:03 PM ISTUpdated : Sep 19, 2018, 09:26 AM IST
తెలుగు జాతికి ఇచ్చిన వారెంట్‌గా భావిస్తున్నా: మంత్రి అచ్చెన్నాయుడు

సారాంశం

బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చెయ్యడంపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై కుట్రతోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు వచ్చిన వారెంట్‌ తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి వచ్చిన వారెంట్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. 

శ్రీకాకుళం జిల్లా: బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చెయ్యడంపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై కుట్రతోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారని ఆరోపించారు. చంద్రబాబుకు వచ్చిన వారెంట్‌ తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి వచ్చిన వారెంట్‌గా భావిస్తున్నట్లు తెలిపారు. 

బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం కలుగుతుందని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రైతుల పక్షాన పోరాడారన్నారు. 2007లో దేవేందర్‌గౌడ్‌ నాయకత్వంలో తాను కూడా బాబ్లీ వెళ్లానన్న  అచ్చెన్నాయుడు నాకెందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. తమని తప్పించి చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. 

ఈనెల 23న ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేందుకు వెళ్లనున్న చంద్రబాబును అడ్డుకునేందుకు వేసిన ఎత్తుగడగా అనుమానిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదన్నారు. ఎవరు ఎటువంటి కుట్రలు పన్నినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Press Meet: వేట్లపాలెం మృ*తుల కుటుంబాలకు 20లక్షలు ఆర్థిక సాయం | Asianet News Telugu
CM Chandrababu Naidu:వేట్లపాలెం ప్రమాద ఘటనపై అధికారులని సస్పెండ్ చేసిన సీఎం| Asianet News Telugu