దేవాదాయ శాఖలో అధికారుల మధ్య వాగ్వాదం.. డిప్యూటీ కమిషనర్ మీద ఇసుక చల్లిన అసిస్టెంట్ కమిషనర్..

By AN TeluguFirst Published Aug 5, 2021, 3:00 PM IST
Highlights

జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆ భూముల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది మీద పలుమార్లు ఆయన ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అధికారుల ఉదాసీనతను పుష్ఫవర్థన్ ప్రశ్నించడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. 

విశాఖ పట్నం : విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసకుంది. డిప్యూటీ కమిషనర్ పుష్ప వర్థన్ మీద అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక పోశారు. పుష్పవర్థన్ నెలరోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ మీద వచ్చారు. 

జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆ భూముల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది మీద పలుమార్లు ఆయన ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అధికారుల ఉదాసీనతను పుష్ఫవర్థన్ ప్రశ్నించడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. 

అసిస్టెంట్ కమిషనర్ శాంతి చర్యలతో నిర్ఘాంతపోయిన పుష్ప వర్థన్  ఘటనమీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయానికిి విజిలెన్స్ సిబ్బంది చేరుకుని మొత్తం వ్యవహారం మీద విచారణ చేపట్టారు. 

click me!