మందకోడిగా రుతుపవనాల కదలిక... రాగల మూడురోజులు ఇదీ ఏపీలో వాతావరణ పరిస్థితి

Arun Kumar P   | stockphoto
Published : Jun 25, 2021, 12:50 PM ISTUpdated : Jun 25, 2021, 12:52 PM IST
మందకోడిగా రుతుపవనాల కదలిక... రాగల మూడురోజులు ఇదీ ఏపీలో వాతావరణ పరిస్థితి

సారాంశం

ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో నేటి(శుక్రవారం) నుంచి రాగల మూడురోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.  

అమరావతి:  ఝార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు 1.5 కిమీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణిగా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో నేటి(శుక్రవారం) నుంచి రాగల మూడురోజుల పాటు వర్షాలు కురవనున్నాయని తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర,యానాం, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని ప్రకటించారు. 

రేపటి నుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించక నైరుతి రుతుపవనాల కదలిక మందకొడిగా సాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ