రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..

Published : May 05, 2023, 05:09 PM ISTUpdated : May 05, 2023, 05:17 PM IST
రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల విడుదల తేదీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల విడుదల తేదీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి ఫలితాలను మే 6వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చల సందర్బంగా బొత్స ఈ విషయం తెలిపారు. రేపు ఉదయయం 11 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి.  ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు.. అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ ను సందర్శించడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 

ఇరాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాలలో పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరిగింది. సుమారు 6.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 19  నుంచి ఏప్రిల్ 26 మధ్య జరిగింది. 

PREV
click me!

Recommended Stories

Divyang Shakti Beneficiaries Reception: దివ్యంగులతో చంద్రబాబు, లోకేష్ భోజనం | Asianet News Telugu
CM Chandrababu Comments: రాబోయే రోజుల్లో ఇలా పాలన చెయ్యను చంద్రబాబు | Asianet News Telugu