అమరావతి స్కామ్‌లో ట్విస్ట్: సీజేఐకి జగన్ లేఖ.. అజేయ కల్లం కీలక ప్రకటన

Siva Kodati |  
Published : Oct 10, 2020, 10:09 PM IST
అమరావతి స్కామ్‌లో ట్విస్ట్: సీజేఐకి జగన్ లేఖ.. అజేయ కల్లం కీలక ప్రకటన

సారాంశం

అమరావతి కుంభకోణం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ కుమార్తెల పాత్రపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డేకి ఈ నెల 6న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. 

అమరావతి కుంభకోణం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌లో సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ కుమార్తెల పాత్రపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డేకి ఈ నెల 6న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు.

టిడిపి కి అనుకూలంగా హైకోర్టు ఇస్తున్న తీర్పుల కాపీలను ప్రభుత్వం ఈ లేఖకు జత చేసింది. మాజీ ఏజీ దమ్మలపాటి కేసు లో మీడియా కవరేజ్ లేకుండా జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.

టిడిపి అధినేత చంద్రబాబు తో దమ్మలపాటికి ఉన్న సంబంధాల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు వచ్చాయని ప్రభుత్వం లేఖలో ఆరోపించింది. అమరావతి భూ కుంభకోణం వెనుక వివిధ చానళ్లలో వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం స్పందించారు.

శనివారం రాత్రి విజయవాడలో కీలక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనం దృష్ట్యా కొన్ని ఛానళ్లలో వస్తున్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడించాలని నిర్ణయించుకున్నామన్నారు. 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu