తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

ఏపీ ఐసెట్-2019 ఫలితాలు విడుదల: గుంటూరు విద్యార్ధికి ఫస్ట్ ర్యాంక్

Siva Kodati | Published : May 8, 2019 12:38 PM

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఏపీ ఐసెట్-2019 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బుధవారం విజయవాడలో విడుదల చేశారు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఏపీ ఐసెట్-2019 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బుధవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న జరిగిన ఐసెట్‌కు 48,445 మంది విద్యార్ధులు హాజరవ్వగా.. 27న ప్రాథమిక కీని విడుదల చేశారు.

ఫలితాలలో గుంటూరుకు చెందిన నాగసుమంత్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కంటే కావ్యశ్రీ రెండో ర్యాంక్, విజయవాడకు చెందిన శివసాయి మూడో ర్యాంక్ సాధించారు. జూలై 3వ వారంలో ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఛైర్మన్ ప్రకటించారు. ఫలితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

click me!