పోలవరంపై ఏపీ హైకోర్టు సంచలనం: కాలువ తవ్వకాలపై స్టే విధింపు

Published : Mar 06, 2023, 02:48 PM ISTUpdated : Mar 06, 2023, 02:53 PM IST
పోలవరంపై  ఏపీ హైకోర్టు  సంచలనం: కాలువ తవ్వకాలపై స్టే  విధింపు

సారాంశం

పోలవరం  కాలువ పనుల్లో అక్రమంగా  మైనింగ్ ను  తరలిస్తున్నారని దాఖలైన పిటిషన్ పై   ఏపీ హైకోర్టు  ఇవాళ విచారణ నిర్వహించింది.    

అమరావతి:  పోలవరం  కాలువ తవ్వకాలపై  ఏపీ హైకోర్టు  సోమవారం నాడు స్టే విధించింది. ఈ విషయమై  కౌంటర్ దాఖలు  చేయాలని  హైకోర్టు ఆదేశించింది. ఈ విషయమై విచారణను  రెండు వారాలకు  వాయిదా  వేసింది.  

 పోలవరం   కాలువలో   అక్రమ  మైనింగ్ జరుగుతుందని  పిల్లి సురేంద్ర బాబు  ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది  ఏపీ హైకోర్టు.  అక్రమ తవ్వకాలతో గ్రావెల్  అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తున్నారని పిటిషనర్  తరపు న్యాయవాది  హైకోర్టులో వాదించారు.  

 ప్రజా ప్రతినిధులు , అధికారుల అండదండలతోనే అక్రమంగా  మైనింగ్  జరుగుతుందని పిటిషనర్ వాదించారు.   పిటిషనర్ తరపున  ఉమా మహేశ్వరరావు  హైకోర్టులో వాదనలు  విన్పించారు. పోలవరం  కాలువ అక్రమ తవ్వకాలపై  ఏపీ హైకోర్టు  ఆగ్రహం వ్యక్తం  చేసింది.  పోలవరం కాలువ తవ్వకాలపై  ఏపీ హైకోర్టు  స్టే విదించింది.  

ఈ విషయమై  కౌంటర్ దాఖలు  చేయాలని  ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించింది హైకోర్టు.  తదుపరి విచారణను  రెండు వారాలకు  వాయిదా వేసింది  ఏపీ హైకోర్టు.
 

PREV
click me!

Recommended Stories

నారా భువనేశ్వరి ఇంగ్లీష్ స్పీచ్ కి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ షాక్| Asianet News Telugu
Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu